Pages

Tuesday, October 4, 2011

శాంతియుత ఉద్యమంలో సీమాంధ్రుల చిచ్చు

- జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సుల క్యూ
- పోలీసుల లాఠీచార్జితో ఆగ్రహించిన తెలంగాణవాదులు
- 50 బస్సుల అద్దాలు ధ్వంసం.. నకిరేకల్ సీఐ తలకు గాయాలు
- పలువురు తెలంగాణవాదుల అరెస్టు
- నేడు రహదారుల దిగ్బంధం: నల్లగొండ జిల్లా జేఏసీ
- కరెంట్ కోతకు నిరసనగా బస్సులు అడ్డుకుంటాం
- రైతులంతా రోడ్లపైకి రావాలని పిలుపు

Buedd-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaనల్లగొండ, టీన్యూస్ ప్రతినిధి:ప్రశాంతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో సీమాంవూధులు చిచ్చు రేపారు. ఇరవై రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమంలో సీమాంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించిన ప్రైవేటు బస్సులను ఉద్దేశపూర్వకంగా తెలంగాణవాదులను రెచ్చగొ పట్టపగలు నడిపిస్తున్నారు. తెలంగాణలో సకల జనుల సమ్మె జరుగుతున్న విషయం తెలిసి కూడా సీమాంవూధుల ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులను నడుపుతున్నారు. సోమవారం నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం కొత్తగూడెం నుంచి రామాపురం క్రాస్‌రోడ్డు వరకు తొమ్మిదవ నెంబర్ జాతీయ రహదారిపై వివిధ సంఘాలు అందోళన కార్యక్షికమాలు చేపడుతున్నారు. కోదాడ బైపాస్‌రోడ్డులోని అయ్యప్పస్వామి టెంపుల్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తుండగా అప్పుడే ప్రైవేటు బస్సులు అటు నుంచి వస్తుండటంతో వాటిని అడ్డుకున్నారు. పోలీసులు తెలంగాణవాదులను మూక్ముమ్మడిగా అరెస్టు చేసి అక్కడ నుంచి బస్సులు హైదరాబాద్ వైపుకు పంపించారు.

జేఏసీ నేతల అరెస్టు విషయం తెలుసుకున్న తెలంగాణవాదులు కొమరబండ, ఆకుపాముల, మునగాల వద్ద రాస్తారోకోకు దిగారు. పోలీసు సెక్యూరిటీతో అక్కడకు వచ్చిన బస్సులపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మె జరుగుతున్న ఈ సందర్భంలో ఎందుకు బస్సులు నడుపుతున్నారని ప్రశ్నించడంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు. దీంతో అగ్రహించిన తెలంగాణవాదులు బస్సులపై రాళ్లు రువ్వడంతో ఎనిమిది బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కేవలం డ్రైవర్‌పై అగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణవాదులు బస్సు ముందు అద్దాలను ధ్వంసం చేశారు. తెలంగాణవాదులపై పోలీసు లాఠీచార్జిపై మీడియాలో ప్రచారం కావడంతో తెలంగాణవాదులు పెద్ద ఎత్తున సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రాస్తారోకో చేస్తున్న తెలంగాణవాదులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.

BUSR-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅగ్రహించిన తెలంగాణవాదులు సూర్యాపేటలో ఐదు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. పదిమంది తెలంగాణవాదులను అరెస్టు చేశారు. నకిరేకల్ పట్టణంలో విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు భారీ ఎత్తున జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రక్షణలో ప్రైవేటు బస్సులు రావడంతో రాస్తారోకో చేస్తున్న తెలంగాణవాదులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో అగ్రహించిన తెలంగాణవాదులు పోలీసుల రక్షణలో వస్తున్న ప్రైవేటు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఉద్యమకారులు పోలీసు జీపుపై రాళ్లు రువ్వడంతో పోలీసుల జీపు అద్దాలు ధ్వంసం అయ్యాయి. జీపులో ఉన్న నకిరేకల్ సీఐ విశ్వవూపసాద్‌కు తలకు గాయం అయ్యింది. దీంతో ఉద్యమ కారులను చెదరకొట్టారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు సుధాకర్, టీటీజేఏసీ నాయకులు అంజయ్యలతో పాటు మరో పదిమందిని అరెస్టు చేశారు.

Policer-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaపోలీసులు సుమారు 15 జీపుల్లో ప్రైవేటు బస్సులకు రక్షణగా ఉంటూ హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. కోదాడ నుంచి నకిరేకల్ వరకు పోలీసులు లాఠీచార్జి చేసుకుంటూ ప్రైవేటు బస్సులకు రక్షణ ఉంటూ నడిపిస్తున్న విషయం ప్రచారం కావడంతో చౌటుప్పల్ వద్ద భారీ ఎత్తున తెలంగాణవాదులు మోహరించి ప్రైవేటు బస్సులను అడ్డకున్నారు. అక్కడ మరో పది బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అడ్డుకున్న మరో 20 మంది ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు రక్షణలో ప్రైవేటు బస్సులను హైదరాబాద్‌కు తరలించారు.

ఎన్‌హెచ్ 9, వాడపల్లి, సాగర్ వద్ద దిగ్బంధం: జేఏసీ
నల్లగొండ: తెలంగాణలో విద్యుత్ కోతలకు నిరసనగా జిల్లావ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేస్తామని నల్లగొండ జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్ జి పేర్కొన్నారు. సోమవారం జేఏసీ కో కన్వీనర్ గోలి అమరేందర్‌డ్డి, టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు గుంతకండ్ల జగదీశ్వర్‌డ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెళ్లి చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి, టీఆర్‌ఎస్ నేత దుబ్బాక నర్సింహాడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 8గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు కోదాడ సమీపంలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద, వాడపల్లి బ్రిడ్జి, నాగార్జునసాగర్ బ్రిడ్జి వద్ద ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను అడ్డుకుంటామని ప్రకటించారు.

NLGTG-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaనాగార్జునసాగర్, శ్రీశైలం పవర్‌వూపాజెక్టుల ద్వారా రాష్ట్రం మొత్తానికి విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా తెలంగాణ రైతులపై నిర్లక్ష్య ధోరణితో సీఎం రైతులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి సమ్మెతో పక్క రాష్ట్రాల్లో కరెంటు సరఫరా ఆగిపోతే, ఆ ప్రభుత్వాలు ఒక్క యూనిట్‌కు ₹ 9ల చొప్పున కొని ప్రజలకు అందిస్తున్నాయన్నారు. సమ్మె వల్లనే విద్యుత్ ఉత్పత్తి తగ్గిందనే అపవాదును రుద్దడానికే వ్యవసాయానికి సీఎం కరెంట్‌కోత విధిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఖరికి నిరసనగా జాతీయరహదారుల వెంట ఉన్న గ్రామాల రైతులంతా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధం చేయాలని కోరారు.

No comments:

Post a Comment