Pages

Sunday, October 2, 2011

వలస గ్రహణం పట్టిన మన ప్రాజెక్టులు


1956 నుంచే కృష్ణా, గోదావరి జలాలను వీలైనంత మటుకు పూర్తిగా హరించాలన్న దుష్ట పన్నాగాలతోనే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ వచ్చారు ఈ వలసవాదులు. కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించడం, పొరుగు రాష్ట్రాలతో లాలూచీపడడం-కోర్టుల ఎదుట తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అసమర్థంగా వాదించడం ఇవన్నీ ఆ కుట్రలోని భాగాలే.ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు కట్టడానికి అప్పటి ప్రభుత్వం నమూనాలు తయారు చేసిందని కేసీఆర్ ప్రసంగంలో విన్నాను. వాటి వివరాలు తెలియజేయగలరని కోరుతున్నాను.
-విక్రం రాజ్, భీంగల్, నిజామాబాద్

కేసీఆర్ చెప్పింది, మీరు విన్నది నూటికి నూరు పాళ్లు నిజం. నాటి హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన, తలపెట్టిన, అమలు చేసిన అనేక భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో కొన్ని ఆంధ్రవూపదేశ్ ఏర్పడ్డాక గల్లంతయినయి, కొన్ని కుదించబడ్డయి, కొన్ని పెండింగ్‌లో పెట్టబడినయి. ఈ పరిస్థితిని గమనించిన బచావత్ ట్రిబ్యునల్ తన నివేదికలో ఈ మాటల్ని పొందుపరిచింది.
Had there been no division of that state (Hyderabad) there were better chances for the residents of this area to get irrigation facilities in Mahabubnagar district. We are of the opinion that this area should not be deprived of the benefit of irrigation on account of reorganisation of states.
(హైదరాబాద్ రాష్ట్రం విభజించబడకపోయి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లాలోని ఈ ప్రాంతానికి సాగునీటి వసతులు అధికంగా దక్కే అవకాశాలుండేవి. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ మూలంగా ఈ ప్రాంతం సాగునీటి లబ్ధికి దూరం కాకూడదని మా అభివూపాయం) ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విలీనమైన కారణంగా భారీగా నష్టపోయిందనడానికి పై మాటలే నిదర్శనం.హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాటిలో కొన్నింటిని ప్రారంభించినా సమైక్య రాష్ట్రంలో అడ్రస్ లేకుండా గల్లంతయిన ప్రాజెక్టుల వివరాలు ఇవి.
1) తుంగభద్ర ఎడమగట్టు కాలువ పొడిగింపు ప్రాజెక్టు 2)భీమా ప్రాజెక్టు (ఇప్పుడు కడ్తున్న ‘భీమా’ ప్రాజెక్టు భీమాపై కాదు) 3) అప్పర్ కృష్ణా కుడిగట్టుకాలువ పొడిగింపు ప్రాజెకు ్ట4) గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు 5) ఇచ్చంపల్లి ప్రాజెక్టు 6) దేవనూర్ ప్రాజెక్టు 7) రాజోలిబండ మళ్లింపు పథకం. గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు రూపాంతరం చెంది తక్కువ నీటి వినియోగంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రథమదశ, ద్వితీయ దశ, వరదకాలువగామారిపోయింది.
నిజాం ప్రభుత్వంలో 1946లో ప్రారంభమైన రాజోలిబండ ఆనికట్ (Ancut), ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పాడ్డాక పూర్తయింది. దీనిదో విషాదగాథ. 1944లో నిజాం ప్రభుత్వం, మదరాసు ప్రభుత్వం ఉమ్మడిగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పటికే మదరాసు ప్రభుత్వంలో చెలామణిలో ఉన్న కేసీ కాలువతో పాటుగా కొత్తగా కట్టబోయే ఆర్డీఎస్ కాలువ సమానంగా నీళ్లు పంచుకోవాలి. ఆంధ్రవూపదేశ్ ఏర్పడ్డాక ఈ వేళ కేసీ కాలువకు అధికారికంగా 39.9 టీఎంసీలు, ఆర్డీఎస్ కు 17.1 టీఎంసీలు దక్కాయి. ఇందులో కర్ణాటక వాటా 1.2 టీఎంసీలు పోను, తెలంగాణకు ఆర్‌డీఎస్ ద్వారా దక్కిన నీరు 15.90 టీఎంసీలు. కానీ వాస్తవానికి ఆర్డీఎస్ ద్వారా ఎప్పుడూ 6-7 టీఎంసీలు దాటి మహబూబ్‌నగర్ జిల్లాకు నీళ్లు రాలేదు. ఆర్డీఎస్ తూములను పగులగొట్టి, అక్రమంగా కేసీ కాలువ ఆయకట్టు దారులు కేసీ కాలువలకు ఆర్డీఎస్ నీటిని దోచుకుంటున్నా ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చున్న విషయం తెలిసిందే.

మిగిలిన ప్రాజెక్టుల వైనం ఇది:తుంగభద్ర ఎడమగట్టు కాలువ పొడిగింపు ప్రాజెక్టు
1947లో నైజాం ప్రభుత్వం తుంగభద్ర ఎడమకాలువను పొడిగించాలని తద్వారా 19.2 టీఎంసీల వినియోగంతో గద్వాల ఆలంపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా)లోని 1,20,000 ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రతిపాదించింది. 1 నవంబర్ 1956కు ముందు రెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేర్చడానికి అంగీకరించలేదన్న కారణంగా బచావత్ ట్రిబ్యునల్ ఈ కాలువకు కేటాయింపులు చేయలేదు. ఫలితంగా ఈ పొడిగింపు కార్యక్షికమం ఆగిపోయింది. తుంగభద్ర ఎడమకాలువ కర్ణాటక ప్రభుత్వం వరకే పరిమితమైంది.

అప్పర్ కృష్ణ ప్రాజెక్టు కుడిగట్టు కాలువ పొడిగింపు ప్రాజెక్టు
తుంగభద్ర ఎడమకాలువ పొడిగింపు చర్యకు అదనంగా ఆలంపూర్, గద్వాల ప్రాంతానికి (నడిగడ్డ) అప్పర్ కృష్ణ ప్రాజెక్టు (ఆలమట్టి) ద్వారా కూడా 1,50,000 ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పరచాలని, ఇందుకోసం 54.4 టీఎంసీల నీటిని వినియోగించాలని హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టింది. ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడమటుంచి, కనీసం రెండవ పంచవర్ష ప్రణాళికలో చోటు దక్కించుకోలేని కారణంగా ఈ ప్రాజెక్టుకు కూడా నీటి కేటాయింపులు జరిపేందుకు ట్రిబ్యునల్ ఒప్పుకోలేదు. ఫలితం-ఈ ప్రాజెక్టు కూడా రూపుదాల్చలేదు.

భీమా ప్రాజెక్టు
నాటి హైదరాబాద్ ప్రభుత్వం గుల్బర్గా జిల్లా (ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది)లో భీమా ప్రాజెక్టును కృష్ణాకు ముఖ్యమైన ఉపనదియైన భీమాపైన గుల్బర్గా, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఉపయోగపడేలా తలపెట్టింది. 100.70 టీఎంసీల నీటి వినియోగంతో మహబూబ్‌నగర్ జిల్లాలో 3,80,000 ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు రూపుదాల్చి ఉంటే ఉపయోగపడి ఉండేది. దురదృష్టవశాత్తు బచావత్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టును కూడా పైన చెప్పిన రెండు ప్రాజెక్టుల మాదిరిగా తిరిస్కరించింది. నిర్ధారిత సమాయానికి ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడం ఒక కారణమైతే ప్రణాళిక సంఘం రెండవ పంచవర్ష ప్రణాళికలో చేర్చకపోవడం మరో కారణం.
ఏమైతేనేం బంగారం లాంటి మూడు ప్రాజెక్టులు తుంగభద్ర ఎడమకాలువ పొడిగింపు, అప్పర్ కృష్ణ కుడికాలువ పొడిగింపు, భీమ ప్రాజెక్టులను హైదరాబాద్ రాష్ట్రం అంతర్థానమై ఆంధ్రవూపదేశ్‌లో విలీనమైన కారణంగా.. తెలంగాణ ప్రాంతం మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లా కోల్పోయింది-174 టీఎంసీల కృష్ణా నికర జలాలు. అందులోనూ గ్రావిటీ మార్గంగా మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసి ఉండేవి. ఈరోజున మహబూబ్‌నగర్ జిల్లా వలసకు గురయ్యే జిల్లాకు మారుగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల మాదిరిగా అన్నపూర్ణయై కళకళలాడుతూ ఉండేది.


ఈ మూడు ప్రాజెక్టులను తెలంగాణకు ఇవ్వలేని తమ అశక్తతకు బదులు గా ట్రిబ్యునల్ కంటి తుడుపు చర్యగా ‘జూరాలా’ ప్రాజెక్టును అనుమతించి, దానికి ప్రత్యేకంగా 17.84 టీఎంసీలను కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ ఎదుట వాదించిన మన తరఫు వకీలు మరింత సమర్థవంతంగా వాదిం చి ఉంటే మనకీ అన్యాయం జరిగేది కాదని తెలంగాణవాదులు భావిస్తున్నా రు. దీనికి కారణం బచావత్ ట్రిబ్యునల్ తమ నివేదికలో వెలిబుచ్చిన ఈ అభివూపాయం.
The council of Andhra Pradesh claimed relief under section 108(2) of the state Re organisation act, 1956 only and did not agree that Andhrapradesh was entitled to the relief under section 107 and 108 (1) of the act or under any other provision of law
‘ఆంవూధవూపదేశ్ తరఫు వకీల్’ రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 1956 లోని సెక్షన్ 108(2) కింద మాత్రమే తమకు ఉపశమనం కలిగించాలని వాదించాడే తప్ప సెక్షన్ 107 కాని 108 (1) కింద కాని మరే ఇతర న్యాయసూవూతాల ఆధారంగా తమకు ఉపశమనం కలిగించాలని వాదించలేదు. ఆనాటి పాలకుల అభిమతానికనుగుణంగానే వకీలు కిమ్మనకుండా ఉండిపోయాడని అనుకోవలసి వస్తుంది.
ఇక గోదావరి నదిపైన ప్రాజెక్టుల విషయానికి వస్తే పరిస్థితి మరీ ఘోరం. దయనీయం. 330 టీఎంసీల వినియోగంతో 20 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు, 175 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో గోదావరి బహుళార్థ సాధక ప్రయోజక ప్రాజెక్టును హైదరాబాద్ ప్రభుత్వం సవివర అధ్యయనాలు కొనసాగించి, డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును (డిపిఆర్) 1954లో కేంద్రానికి సమర్పించింది. కేవలం నిధుల కొరత కారణంగా ఈ ప్రాజెక్టును రాష్ట్రం ప్రారంభించలేదు.

నేడో రేపో ప్రాజెక్టు మొదలవుతుందని అందరూ ఆశిస్తూ ఉంటే, తెలంగాణ ప్రజలకు ఇంత అద్భుతమైన ప్రాజెక్టు ఉపయోగపడటం వలసవాదులు జీర్ణించుకోలేక, కేంద్రంలో పనిచేస్తున్న ఓ అత్యంత బలశాలియైన ఉన్నతాధికారి అండదండలతో ఈ ప్రాజెక్టును అడ్డగించడానికి కుతంవూతాలు, కుట్రలు పూనారు. ప్రాజెక్టుపై సాంకేతిక వివరణల సాకుతో, ఆర్థిక వనరుల లేమి కారణంతో ‘సాగదీత’ పద్ధతిని అవలంబించి ప్రాజెక్టును సకాలంలో మంజూరు చేయకుండా అడ్డుపడడం జరిగింది. ఈ లోగా చాటు మాటున మహారాష్ట్ర ప్రభుత్వానికి ‘ఉప్పు’ అందించి, అంతర్ రాష్ట్ర నదీ జలాల వివా ద చట్టం 1956 ప్రకారం గోదావరి జలాలలో వాటాలు కేటాయించాకే గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు చేపట్టవలసి ఉంటుందని మహారాష్ట్ర ప్రభు త్వం చేత కేంద్రానికి అర్జీ పెట్టించడంలో కేంద్రంలో పనిచేస్తున్న ఆ ఉన్నతాధికారి కృతకృత్యుడయ్యాడు. గోదావరి జలాల వివాదం పరిష్కార నిమిత్తం ట్రిబ్యునల్ ఏర్పాటు కావడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. ఆ తరువాత అనేక మార్పులు చేర్పులు జరిగి గోదావరి బహుళార్థక ప్రాజెక్టు సైజును కుదించి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా అవతరింపజేసింది ప్రభుత్వం.


వలసవాదుల కుతంవూతాలకు, కుట్రలకు బలైపోయిన మరో ప్రాజెక్టు దేవనూరు. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం విద్యుత్ ఉత్పాదన. ఎడమ కాలువ ద్వారా రెండుచోట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో పాటు దేవనూరు జలాశయంలో నిలుచేసిన నీటిని ఓ పద్ధతి ప్రకారం విడుదల చేసి తద్వారా నిజాం సాగర్ ఆయకట్టులో మరో 50 వేల ఎకరాలకు నీరు అందివ్వాలన్నది ప్లాన్. దీనితో పాటు దేవనూరు నుంచి 150 క్యూసెక్కుల నీటిని జంటనగరాల తాగునీటి సరఫరా కోసం ఉపయోగించాలన్నది మరో లక్ష్యం. ప్రాజెక్టు రిపోర్టులు అన్నీ సిద్ధమయి, ప్రాజెక్టు ప్రారంభం కావడమే మిగిలింది. ప్రాజెక్టు మూలంగా కర్ణాటకలో ముంపుకు గురయ్యే భూములకు నష్టపరిహారం డబ్బు కూడా రెడీగా ఉంది. ఆ దశలో రాష్ట్రం వద్ద ఉన్న వనరులు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే గోదావరి బహుళార్థ ప్రాజెక్టు మొదపూట్టడంలో జాప్యం జరుగుతుందన్న ఓ బలమైన వాదనను తెరపైకి తీసుకువచ్చి గోదావరి ప్రాజెక్టులో ఆసక్తి ఉన్న అప్పటి తెలంగాణకు చెందిన భారీ నీటి పారుదల శాఖా మంత్రి చేతనే ‘మాకీ ప్రాజెక్టు అవసరం లేదు’ అని కర్ణాటకకు రాయించగలిగిన శక్తిమంతులు ఈ వలసవాదులు. ఫలితంగా దుష్ట వలసవాదుల కుతంవూతాలచవూటంలో ఇరుక్కున్న తెలంగాణ అమాయక అమాత్యులు అటు గోదావరి ప్రాజెక్టును, ఇటు దేవనూరును చేజార్చుకున్నారు.

కాలక్షికమేణ ‘దేవనూరు’ సింగూరుగా రూపాంతరం చెందింది. అది వేరే కథ. ఇదిలా ఉంటే ఇచ్చంపల్లిది మరో కథ. మొదటి నుంచి ఇచ్చంపల్లిని కల్పవల్లిగాఅభివర్ణించడం జరిగింది. పొరుగు రాష్ట్రాలు ముంపు కారణంగా దీన్ని వ్యతిరేకించడం, పోలవరం ఇచ్చంపల్లి రెంటికీ ఒకే మాదిరి సమస్యలున్నా ప్రభుత్వానికి పోలవరంపైన ప్రేమలో ఓ వందోవంతైనా ఇచ్చంపల్లిపై లేకపోవడంతో ‘పోలవరాన్ని’ ముందుకు నడిపిస్తూ ఇచ్చంపల్లిని మాత్రం నడి సంద్రంలో ముంచింది వలసవాద ప్రభుత్వం.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే 1956 నుంచే కృష్ణా, గోదావరి జలాలను వీలైనంత మటుకు పూర్తిగా హరించాలన్న దుష్ట పన్నాగాలతోనే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ వచ్చారు ఈ వలసవాదులు. కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించడం, పొరుగు రాష్ట్రాలతో లాలూచీపడడం-కోర్టుల ఎదుట తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అసమర్థంగా వాదించడం ఇవన్నీ ఆ కుట్రలోని భాగాలే. ఈ దుర్మార్గం నాటి నుంచి నేటికీ కొనసాగుతోంది. దీనికి ఏకైక పరిష్కారం ప్రత్యేక రాష్ట్రం మాత్రమే.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్



ఇదీ సంగతి
వరదలు-నియంవూతణ
ప్రతి ఏడూ మన దేశ విస్తీర్ణంలోని ఎనిమదోవంతు అంటే సుమారు నాలుగు కోట్ల హెక్టార్ల భూమి (10 కోట్ల ఎకరాలు) వరద తాకిడికి గురవుతుందని అంచనా. వరదల మూలంగా భారీగా ప్రాణనష్టం, పశు, పంట నష్టం జరుగుతోందన్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న వరద నియంవూతణ చర్యలను రెండు కేటగిరిలలో విభజించవచ్చు.
ఒకటి నిర్మాణపరమైన చర్యలు, (Structural measures) రెండు నిర్మాణేతర చర్యలు (Non Structural measures). వరద నీటికి ఆశ్రయమివ్వడానికి జలాశయాలు, చెరువులు, సరస్సుల నిర్మాణంతో పాటు వరదల నుంచి రక్షణ కోసం కరకట్టల నిర్మాణం, నదీ, కాలువ గర్భాలను అభివృద్ధి పరచడం, చెరువులలో పూడికలు తీయడం వగైరా వంటివి నిర్మాణ పరమైన చర్యలు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఎత్తై వేదికలు ఏర్పాటు చేయడం, వరద ప్రమాద సూచికలు జారీచేసే ఏర్పాటు, వరదల బీమా పథకం, వరద విపత్తునెదుర్కొనేందుకు సిబ్బందికి శిక్షణ, సమాయత్త పరచడం వగైరా వంటివి నిర్మాణేతర చర్యలు.ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా, ప్రజల భాగస్వామ్యం, సహకారం లేకుండా వరద నియంవూతణ ప్లాన్లు విజయవంతం కావు. అడవులను కాపాడటం, చెరువులను కబ్జా నుంచి రక్షించడం, జల సంరక్షణ కార్యక్షికమాలు చేపట్టి నీటి కట్టడాలను దేవాలయాలుగా భావించడం జరిగితేనే వరదలను కొంత మేరకు నియంవూతిచవచ్చు. విషయమేమంటే ‘వరదలను నివారించలేం-కొంత మేరకు నియంవూతించవచ్చు-వరదతో సహజీవనం కొనసాగించక తప్పదు’ అన్న కఠిన సత్యాన్ని మనం జీర్ణించుకోవాలి.

No comments:

Post a Comment