Pages

Monday, September 19, 2011

సకలం దిగ్బంధం

-పయ్య కదలదు.. తొవ్వ సాగదు
- జాతీయ రహదారులపై నేడు చారివూతక సన్నివేశం
- ఉత్తర- దక్షిణ రాష్ట్రాల మధ్య సంబంధాలు కట్
- సీమాంధ్ర దారులన్నీ క్లోజ్
- సమ్మె కట్టిన ఆర్టీసీ
- తెలంగాణలో 10 వేల బస్సులు ఎక్కడివక్కడే..
- నేడు, రేపు క్యాబ్స్ కూడా బంద్
- 23 అర్ధరాత్రి నుంచి ఆటోలదీ అదే దారి
- హోరెత్తిన తెలంగాణం

road-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ పోరు రహదారులపై పరుగుపూత్తుతోంది. మరో చారివూతక సన్నివేశానికి తెర లేపుతోంది. తెలంగాణ ప్రాంతాన్ని దిగ్బంధనం చేయడానికి సకల జనులు సమర శంఖం పూరించారు. ఉత్తర,దక్షిణాది రాష్ట్రాల మధ్య రాకపోకలను పూర్తిగా స్తంభించి వేసేందుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణకు దారితీసే సీమాంధ్ర దారులన్నీ మూత పడనున్నాయి. సకల జనుల సమ్మె పతాక స్థాయికి చేరుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జరుగుతున్న సకల జనుల సమ్మె సోమవారం నుంచి ఉధృత రూపం దాల్చనుంది. గత వారంరోజులుగా సాగుతున్న సమ్మె సోమవారం నుంచి కీలక ఘట్టానికి చేరుకోనుంది. రహదారుల దిగ్బంధానికి రాజకీయ జేఏసీ పిలుపునివ్వడంతో తెలంగాణ ప్రాంతానికి దేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోనున్నాయి.

రహదారుల దిగ్బంధనాన్ని సక్సెస్ చేయడానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు, బీజేపీ, న్యూడెమోక్షికసీ నాయకులు తమ కేడర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఉత్తర- దక్షిణ రాష్ట్రాలకు ప్రధాన ద్వారమైన ఆదిలాబాద్ శివారులోని పెన్‌గంగా నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ వరకు ఉన్న కాశ్మీర్ టూ కన్యాకుమారి జాతీయ రహదారులను పూర్తిగా దిగ్బంధించడానికి సిద్ధమయ్యారు. ముంబై టూ కోదాడ జాతీయ రహదారి, నిజామాబాద్ టూ ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారి మొదలుకొని ఇతర దారులన్నీ మూతపడనున్నాయి. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వృత్తిసంఘాలు కదనరంగంలో దూకడంతో సమ్మె ఉధృతంగా మారింది. దీనికి సింగరేణి కార్మికులు తడాఖా చూపడంతో దక్షిణ భారత దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూత పడే స్థితికి చేరుకున్నాయి.

TGR-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema సకల జనుల సమ్మెను అణిచి వేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు పన్నుతోంది. సింగరేణిలో పోలీసు దమనకాండకు నిరసనగా తెలంగాణలోని అన్ని జేఏసీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగడంతో తెలంగాణవ్యాప్తంగా 10వేల బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయి రవాణా వ్యవస్థ స్తంభించే పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ డిపోలన్నింటికి తాళాలు వేయనున్నారు. 23వ తేదీ అర్ధరాత్రి నుంచి 25వ తేదీ అర్ధరాత్రి వరకు 48గంటలపాటు తెలంగాణలోని ఆటోలన్నీ బంద్ కానున్నాయి. దీంతోపాటు ఆటో డ్రైవర్లు 24న, పదవులకు రాజీనామాలు చేయని ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి 25న మండల, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ ఊరేగింపు, బహిరంగ సభను నిర్వహించనున్నారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ మోటార్ క్యాబ్స్ సోమ, మంగళవారాల్లో బంద్ పాటించనున్నాయి.

సోమవారం నుంచి విద్యుత్ జేఏసీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. విద్యుత్ బిల్లులు కట్టించుకోమని ఆ జేఏసీ ప్రకటించింది. సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ నిరవధికంగా మూత పడనున్నాయి. పాఠశాలల బంద్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయుల జేఏసీ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం పిలుపునిచ్చాయి. ఇంజనీరింగ్, వృత్తి కళాశాలలతో సహా తెలంగాణలోని అన్ని కాలేజీలు రెండు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను పొడిగించే అవకాశం కూడా ఉందని వారు ప్రకటించారు. జంట నగరాల శివార్లలో ఉన్న ప్రైవేట్ సంస్థలు, ఔషధ కంపెనీ కార్మికులు కూడా సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె వల్ల ఇప్పటి వరకు రూ.5వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. తెలంగాణలో సకల జనుల సమ్మె ఉధృత రూపం దాల్చుతున్న సమయంలో ప్రభుత్వం ఈ ప్రాంతంలో పోలీసు బలగాలను భారీగా మోహరిస్తోంది.

ఎక్కడెక్కడ.. ఎవరెవరు
- ఆదిలాబాద్ జిల్లా భోరజ్-మాంవూడగడ: టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా జేఏసీ చైర్మన్ మామిడి నారాయణ, న్యూడెమొక్షికసి నేత నైనాల గోవర్ధన్
- మెదక్ జిల్లా జహీరాబాద్ సరిహద్దు : టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత టీ హరీష్‌రావు, ఎంపీ విజయశాంతి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌డ్డి
- నల్లగొండ,రంగాడ్డి సరిహద్దు కొత్తగూడ: రాజకీయ జేఏసీ చైర్మన్
కోదండరాం, పీవోడబ్ల్యు నేత సంధ్య, ఇతర స్థానిక నాయకులు
- నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి: బీజేపీ నాయకులు సీహెచ్ విద్యాసాగర్‌రావు, చింతా సాంబమూర్తి,స్థానిక నాయకులు
- ఎల్‌బీ నగర్ రహదారిపై: బీజేపీ నేతలు బండారు దత్తావూతేయ, వెంకట్‌డ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, టీఆర్‌ఎస్ ఇంచార్జీ కాచం సత్యనారాయణ
- మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ చౌరస్తా : టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే కే విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ జితేందర్‌డ్డి, నిరంజన్‌డ్డి, బీజేపీ నేతలు నాగూరావు నామాజీ, అశోక్‌కుమార్‌యాదవ్, న్యూడెమొక్షికసి నేతలు గోవర్ధన్, దివాకర్
- నల్లగొండ జిల్లా కోదాడ: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, దాస్యం వినయ్‌భాస్కర్, న్యూడెమొక్షికసి నేత సూర్యం
- ఆదిలాబాద్ జిల్లా వాంకిడి: ఎమ్మెల్యేలు గడ్డం అరవిందడ్డి,నల్లాల ఓదేలు
- నిజామాబాద్ జిల్లా సాలూర: మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌డ్డి, జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ, ఇతర స్థానిక నాయకులు
- నాగ్‌పూర్ రహదారిపై: బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, స్థానిక నాయకులు


కరెంటు బిల్లులు బంద్
powerlines1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema- రేపు కరెంటోళ్ళ శంఖారావం
- టీజాక్ కో-ఆర్డినేటర్ కె.రఘు ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబర్ 18(టీన్యూస్): సకల జనుల సమ్మెకు సంఘీభావంగా ఈనెల 19వ తేదీ నుంచి తెలంగాణ జిల్లాల్లో కరెంటు బిల్లుల వసూళ్ళను నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఎలక్షిక్టిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ(టీజాక్) ప్రకటించింది. ఈనెల 20వ తేదీన తెలంగాణ చౌరస్తా (మింట్‌కాంపౌండ్)లో ‘కరంటోళ్ళ శంఖారావం’ కార్యక్షికమాన్ని నిర్వహించాలని టీజాక్ నిర్ణయించింది. ఇకపై సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు టీజాక్ కో ఆర్డినేటర్ కె.రఘు తెలిపారు. కరెంటు బిల్లు చెల్లించకున్నా కరెంటు నిలుపుదల చేయబోమని ఆయన చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ చౌరస్తాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంటోళ్ళ శంఖారావం పేరుతో భారీ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్షికమానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ఇతర రాజకీయపార్టీల అగ్రనేతలు, వివిధవూపభుత్వ శాఖల జేఏసీ నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి, కార్మిక సంఘాల నాయకులు, తెలంగాణ కళాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.

నేటి నుంచి ప్రైవేటు పాఠశాలల నిరవధిక బంద్
-‘ట్రెస్మా’ అధ్యక్షుడు కె.పాపిడ్డి ప్రకటన

హైదరాబాద్: సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ ప్రైవేటు పాఠశాలలు నేటి నుంచి నిరవధికంగా బంద్ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 15 వేల ప్రైవేటు పాఠశాలలు మూతపడనున్నట్లు ‘తెలంగాణ రికగై్నజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’ టెస్మా) అధ్యక్షుడు కందాల పాపిడ్డి, కార్యదర్శి రాంచదర్ ఆదివారం ప్రకటించారు. సుమారు 1.50 లక్షల మంది ప్రైవేటు టీచర్లు, 10 లక్షల మంది విద్యార్థులు సకల జనుల సమ్మెలో పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బడులకు తాళాలు వేసి సమ్మెలో పాల్గొంటున్నారు. సోమవారం నుంచి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు కూడా సమ్మెలో పాల్గొననుండటంతో తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలన్నింటికి తాళాలు పడినట్లయింది.

నేటి నుంచి వృత్తి విద్యా కాలేజీల బంద్
హైదరాబాద్: సకల జనుల సమ్మెకు మద్దతుగా సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని వృత్తి విద్యా కాలేజీలు బంద్ పాటించనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కాలేజీలు రెండు రోజులపాటు బంద్ పాటించనున్నట్లు ‘కన్సార్షియం ఆఫ్ ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’ తెలంగాణ చైర్మన్ డాక్టర్ కె.సునీల్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సమ్మెకు సీమాంధ్ర యాజమాన్యంలో ఉన్న కాలేజీలు కూడా తమ మద్దతు ప్రకటించి స్వచ్చందంగా బంద్‌లో పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారం వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలు మరోసారి సమావేశమై నిరవధికంగా బంద్ పాటించే అంశంపై చర్చించనున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రదీప్, బీఈడీ కాలేజీల సంఘం అధ్యక్షులు ప్రభాకర్‌డ్డి, ఫార్మసీ కాలేజీల ప్రధాన కార్యదర్శి రాందాస్ తెలిపారు.

No comments:

Post a Comment